మన్యం న్యూస్, దమ్మపేట: దమ్మపేట సిపిఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే జాతీయ మహాసభలను భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని, వేలాదిగా తరలిరావాలని, దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని, నిత్యవసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయని రైతులు అలో రామచంద్ర అంటున్నారని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తున్నారని, ఈ అన్నిటినీ కట్టడం చేయాలి అంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ కార్యకర్తలు కంకణ బద్ధులై రేపు జాతీయ మహాసభలో తీర్మానాలను అమలు చేయాలని మిలిటెంట్ పోరాటాలు చేయాలని రాబోయే రాజ్యం కమ్యూనిస్టు రాజ్యాంమేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యార్లగడ్డ భాస్కరరావు, మండల కార్యదర్శి ఎస్కె దస్తగిరి, సహాయ కార్యదర్శి సుంకుపాక ధర్మ, సహాయ కార్యదర్శి బత్తుల సాయి, ఏఐటీయూసీ నాయకులు దొంగ లక్ష్మీనారాయణ, రాపోలు శివన్నారాయణ, నల్ల ప్రసాద్ నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: