మన్యం న్యూస్ , దుమ్ముగూడెం ::
గోదావరి వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయల ఆర్థిక సహాయం సమస్యను పరిష్కరించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వర్క్ షాప్ సున్నం బట్టి ఆంధ్రకేసరి నగర్ గ్రామాల వర్ధముంపు బాధితులను తాసిల్దార్ చంద్రశేఖర్ కలిసి వినతి పత్రం అందజేశారు గత కొన్ని రోజులుగా గోదావరి వరద ముంపు బాధితులకు నష్టపరిహారం అందలేదని ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని తాసిల్దార్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ధన్ ముప్పు బాధితులు అధికారులు గుర్తించిన ఆధార కార్డు బ్యాంక్ ఎకౌంటు సమస్యలతో నష్టపరిహారం పెండింగ్లో పడుతుందని ఈ సమస్య ఎక్కడ ఉందో గుర్తించి బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. మూడు నెలలు గడుస్తున్నా ఇదే విధంగా సమాధానం చెబుతూ అధికారులు సమస్య ఎక్కడుందో మాకు తెలియడం లేదని చెప్పడం వల్ల నిరుపేద కుటుంబాలకు నిరాశ కలుగుతుందని ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని సిపిఐ పార్టీ మండల కమిటీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నోముల రామిరెడ్డి తాటిపూడి రమేష్ రాయాల కుమారి కోరి శ్రీను దునియాకుల గంగరాజు గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: