మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 13... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16న జరుగనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల సమాచారంతో సందేహాలు, సలహలు నివృత్తి కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు 08744-241950
నంబర్ తో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాచారం, సందేహాకు నివృత్తి కోసం అభ్యర్థులు హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి కానీ, వాట్సాప్ ద్వారా సందేశం పంపి సమాచారం తెలుసుకునేందుకు 9392919743 నంబర్ తో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు వ్రాసే అభ్యర్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని పరీక్షా కేంద్రాల సమాచారం తెలుసుకుని సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విదంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఉదయం 8.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, ఉదయం10.15 గంటలకు పరీక్షా కేంద్రాలలోకి అనుమతించరని అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ చెప్పారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాలను గుర్తించడానికి తయారు చేసిన పరీక్షా కేంద్రాల రూటు మ్యాపులను రూపొందించినట్లు చెప్పారు. పాల్వంచ, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ లలోని ప్రధాన కూడళ్ళు లో రూటు మ్యాపులను ఏర్పాటు చేయనున్నట్ల తెలిపారు.
Post A Comment: