CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి బిడ్డల హక్కులకోసం కొమురం భీం స్ఫూర్తితో పోరాడాలి.

Share it:


మన్యం మనుగడ,  వాజేడు , సెప్టెంబర్ 6.: ములుగు జిల్లా వాజేడు (మండల) పేరూరు గ్రామం లో ఆదివాసి  సంక్షేమ పరిషత్  ఏర్పాటు చేసిన  మండల అధ్యక్షులు టింగ బుచ్చయ్య అధ్యక్షనలో సమావేశం జరిగింది .ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లాకన్వీనర్ పర్షిక సతీష్ మాట్లాడుతూ  ఏజెన్సీ చట్టాలను 5వ షెడ్యూల్ భూభాగాన్ని కాపాడే దిశగా యావత్తు ఆదివాసి సమాజం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.  ఆదివాసులకు అందవలసిన ప్రభుత్వ పథకాలు అందకుండా ప్రభుత్వాధికారులు తుంగలో తొక్కుతూ ఆదివాసులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 1/70 చట్టాన్ని ఏజెన్సీలోని కి గిరిజనేతరులు వలసలు వచ్చి విచ్చల విడిగా అక్రమాలకు పాల్పడుతూ బహుళ అంతస్తులు నిర్మిస్తూ దర్జాగా చలామణి అవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.  ప్రభుత్వ  గిరిజనేతరుల అధికారుల  నిర్లక్ష్యం వల్లనే ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు.  ఆదివాసులకు చెందవలసిన భూములు, అభివృద్ధి పథకాలు అందకుండా గిరిజనేతరులు దోచుకుంటు కబ్జా చేస్తున్న అధికారులకు పట్టింపు లేదని విమర్శించారు.  ఏజెన్సీ ప్రాంతంలో పాలించే ఐఏఎస్ ,అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఐఏఎస్ అధికారులు గిరిజనేతరులకు సపోర్ట్  చేసే పరిస్థితి ఉందని ఆదివాసులు గమనించాల్సి  పరిస్థితి ఉంది అన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు బొదెబాయిన సురేశ్ మాట్లాడుతూ 1970సం  తరువాత వలస గిరిజనేతరుల పూర్తి ఆధారాలు, అక్రమ కట్టడాలు ఏజెన్సీలో  కూల్చివేయాలని  చట్టం చెబుతున్న,నిషేదం అంటూ  కోర్టు చెబుతున్నాయని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో.3  పునరుద్ధరించాలని ఆయన కోరారు.1/70  చట్టాన్ని ఏజెన్సీలో పటిష్టంగాఅమలు చేయాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో తుర్శ కృష్ణ బాబు, మడప సతీష్, తుర్శ చంటి,  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: