- మరువలేను మీ సాయం!
- ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ఐదు లక్షల రూపాయలు మంజూరు
- సంతోషం వ్యక్తం చేసిన దుగినేపల్లి వాసి నందకుమార్
మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామానికి చెందిన బత్తుల నందకుమార్ కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు కావడానికి కుటుంబ సభ్యులు చాలా ధనమును వెచ్చించడం జరిగింది. విషయాన్ని పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకురావడంతో, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఐదు లక్షల రూపాయలను నందకుమార్ పేరు మీద మంజూరు చేయించారు. ఈ విషయం తెలుసుకున్న నందకుమార్ రేగా కాంతారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.పినపాక నియోజకవర్గంలో ఆపద అన్న వెంటనే ఆదుకునే మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా దొరకడం నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును త్వరలోనే ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతులమీదుగా అందుకోబోతున్నందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు. ఆయన చేసిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని తెలియజేశారు.
Post A Comment: