CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గిరిజన నాయకులు

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండలం కళ్యాణపురం గ్రామపంచాయతీ లో తెరాస పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు యన్న సంగీతరావు  ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గం తెరాస పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్  ముఖ్య అతిధిగా పాల్గొని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్  విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి   కెసిఆర్  చిత్రపటానికి పాలాభిషేకం చెయ్యటం జరిగింది.దళితుల పట్ల అంకిత భావంతో నిర్మాణంలో ఉన్న కొత్త సచివాలయానికి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం, దళితులకు దళితబంధు పథకం ప్రవేశ పెట్టడం ఎన్నో సంక్షేమ పధకాలతో తెలంగాణ రాష్ట్రన్ని నిలబెట్టి దేశానికే వన్నె తెచ్చే విదంగా తెలంగాణ రాష్ట్రన్ని ముందుకు తీసుకు వెళ్లుతున్నా అపర భగీరధుడు మన ముఖ్యమంత్రి కెసిఆర్ కి జీవితాంతం గుర్తుపెట్టుకుని వారి ఆశయ సాధన కొరకు పాటుపడతామని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్  లక్ష్మణ్ రావు, మాజీ ఉప సర్పంచ్  సంగీతరావు, గ్రామశాఖ ఎస్సీ విభాగం అధ్యక్షులు  లక్ష్మణ్,  వార్డు మెంబర్లు చల్ల రాజేష్, యన్నా వెంకట నరసమ్మ సీనియర్ నాయకుడు బానోతు చంద్రు, బానోతు రాందాస్, మహిళలు  యువకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: