ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి:
నిన్న తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హైదరాబాద్ వేదికగా ఆదివాసి భవనం ప్రారంభోత్సవం చెయ్యడం,ఆదివాసుల సాగుచేసుకుంటున్న పొడు భూములు పట్టాల గురించి 140 Go ను అమలు చేయటం,పది శాతం గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడం,త్వరలో గిరిజన బంధు సంక్షేమం పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పడం చాలా గొప్ప విషయమని, ఆదివాసీ ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తపరిచారు. ఈ సందర్బంగా ములకపల్లి సెంటర్లో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మట్ల నాగమణి, సర్పంచులు బైటి రాజేష్, వాడే నాగరాజు,సున్నం సుధాకర్, కీసరి శ్రీనివాస్ రావు,వర్గెల రమణ, ఆదివాసి నాయకులు కుంజ రాజులు,ఊరబెది వెంకన్న,యువజన నాయకులు తాటి ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: