CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన బంధు,10% రిజర్వేషన్ పట్ల హర్షనీయం.

Share it:

 


కరకగూడెం మండల సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు పాయం నరసింహారావు  మన్యం మనుగడ కరకగూడెం: హైదరాబాదులో జరిగిన ఆదివాసి,గిరిజన ఆత్మీయ సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు  తెలంగాణలోని గిరిజనులకు 10%శాతం రిజర్వేషన్, అలాగే పోడు భూముల శాశ్వత పరిష్కారం కోసం విడుదల చేసినటువంటి జీవో 140 మరియు దళిత బంధు తరహాలో గిరిజన నిరుపేదలకు గిరిజన బంధు వారం రోజులలో జీవో విడుదల చేస్తానని ప్రకటించడం పట్ల కరకగూడెం మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు పాయం. నరసింహారావు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా  అయన మాట్లడుతు ఆదివాసి,గిరిజన బిడ్డల అభ్యున్నతికి పెద్ద పీఠం వేసి సహకారం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా. కాంతారావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతు,జీవితాంతం మీకు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఇర్ప విజయ్ కుమార్,బత్తిని నర్సింహారావు,  పోలెబోయిన నర్సింహారావు, భూక్యా భాగ్యలక్ష్మి జవ్వాజి రాధ, తాటి సరోజినీ, కొమరం విశ్వనాధం,కుంజ వసంతరావు,పోలెబోయిన పాపమ్మ,తోలెం సావిత్రి, గోగ్గల నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: