మన్యం మనుగడ ప్రతినిధి ,చండ్రుగొండ: అర్హులందరికీ ఆసరా పెన్షన్లు అందజేశామని ఎంపీడీవో అన్నపూర్ణ తెలిపారు. సోమవారం రేపల్లెవాడ గ్రామపంచాయతీలో ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు, మంజూరి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మండలంలో 900 మందికి ఆసరా పెన్షన్లు మంజూరైయని, ఇంకా ఎంతమంది అర్హులున్నా వారందరికీ పెన్షన్లు వచ్చేలా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అర్హులుంటే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అన్ని పంచాయతీ కార్యాలయాల్లో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆసరా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు,ఎంపీటీసీలు అధికారులు,నాయకులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: