మన్యం మనుగడ ప్రతినిధి, చండ్రుగొండ: సమాజ స్థితిగతులను మార్చేది గురువే, అటువంటి గురువులను సన్మానించుకోవడం, ఆదరించడం మనందరి బాధ్యత అని జెడ్పిటిసి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ... సమాజంలో మంచి మార్పులు వచ్చాయి. అంటే దాని వెనుక గురువు కృషి ఉందని అర్థం చేసుకోవాలన్నారు.విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు సమాజంలో మార్పులకు గురువే కారణమన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ధారా బాబు, ఎస్ఎంసి చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఎంఈఓ సత్యనారాయణ, హెచ్ఎం ఆనంద్,ఏఎస్ఐ కృష్ణారావు, రిటైర్డ్ హెచ్ఎం సుధాకర్ రావు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: