మన్యం మనుగడ , వాజేడు , సెప్టెంబర్ 5.: మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ స్కూల్,లో కాలేజ్ లో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 5న ఉపాద్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు మిగతా తరగతుల వారికి పాఠాలను భోదించి స్వయం పాలనా దినోత్సవం ( సెల్ఫ్ గవర్నమెంట్ డే) నిర్వహించడం జరిగింది. ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం జరిగింది. ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ప్రసంగిస్తూ కృషి, పట్టుదల, అంకితభావం కలిగి ఉండాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ను ఆదర్శంగా తీసుకోని అందరు విద్యార్థిని, విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవలన్నారు. ఇందులో పాల్గొన్న పాఠశాల ఉపాధ్యాయులు కస్తూర్బా గాంధీ స్పెషల్ ఆఫీసర్ సుజాత, రమ్యకృష్ణ, నారాయణమ్మ, పద్మ, రజిని, అరుణ కుమారి, జయ, శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: