మన్యం టీవీ , దుమ్ముగూడెం :: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం గా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మండలంలోని పాఠశాలలో ఘనంగా నిర్వహించారు పిల్లలు ఉపాధ్యాయులుగా మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.పిల్లలకు మిఠాయిలు పంపిణి చేసారు అచ్చుతాపురం లక్ష్మీనగరం దుమ్ముగూడెం తో గూడెం పాఠశాలల్లో ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ పిల్లలకు పలు విషయాలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేపల్లి ఉపాధ్యాయ వృత్తి తో మొదలై విద్యావేత్తగా రాజనీతి పరుడిగా మొట్ట మొదటి ఉపరాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించారు ఆయన సామాజిక ఆర్థిక రాజకీయం సంస్కృతి విద్యా రంగంలో తమదైన ముద్ర వేశారు అని ఆయన స్ఫూర్తితో కొనసాగాలని తెలిపారు ఇంతటి వ్యక్తిని సెప్టెంబర్ 5 తన పుట్టినరోజును ఉపాధ్యాయులు దినోత్సవం గా జరుపుకోవడం ఉపాధ్యాయ వృత్తిగా ఉన్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏజే ప్రభాకర్, నాగమణి అప్పక శంకర్ వీర కుమారి రవి నరేందర్ కృష్ణార్జున తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: