- టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యం
- దళిత బందుతో దళితులలో వెలుగులు
- మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్
గుండాల సెప్టెంబర్ 5(మన్యం మనుగడ) టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సంక్షేమ సాధ్యమని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ. దళిత బందు తో దళితులలో వెలుగులు నిండుతాయని ఆయన అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 500 మందికి దళిత బందును అమలు చేస్తామనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని క్యాబినెట్లో నిర్ణయించడంతో పోడు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ప్రభుత్వ వి రేగా కాంతారావు గారి నాయకత్వంలో పినపాక నియోజకవర్గం అభివృద్ధిలో ముందుందని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, యువజన విభాగం నాయకులు అజ్జు, ఆళ్లపల్లి మండల యువజన విభాగం నాయకులు సతీష్ , పార్టీసీనియర్ నాయకులు వీరస్వామి, సుధాకర్, కృష్ణ , రాము, వట్టం రవి, బొమ్మెర్ల శ్రీను, సోషల్ మీడియా సతీష్ , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: