మన్యం మనుగడ, మంగపేట.
దసరా దేవి నవరాత్రుల్లో భాగంగా అయిదవరోజు అన్నపూర్ణగా దర్శనమిచ్చిన కనకదుర్గ అమ్మవారిని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డీ సాంబశివరెడ్డి స్నేహలత దంపతులు శుక్రవారం మండలంలోని అకినేపల్లి మల్లారం లో ఏర్పాటు చేసిన దుర్గామాతని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ అన్నపూర్ణేశ్వరిగా దర్శనం ఇచ్చిన అమ్మవారికి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి దేశానికి అన్నం పెట్టే రైతులు మరియు వ్యవసాయ రంగం బాగుండాలని అమ్మవారికి పూజలు నిర్వహించినట్లు సాంబశివరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంబశివరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ గాలి వేణు కమిటీ ప్రతినిధులు సంపత్ వెంకటేష్ పవన్ రవి వేణు అజారుద్దెన్ మోయినుద్దీన్ విలాస్ నవీన్ పురోహితులు మోదుకూరి ఫణేంద్రాచార్యులు వికాస్ ఆగ్రి ఫౌండేషన్ ప్రతినిధులు చెట్టిపల్లి తిరుపతిరావు నేలపట్ల శేషారెడ్డి ప్రసాద్ పాడి దామోదర్ రెడ్డి నాసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి లక్ష్మారెడ్డి మరియూ అకినేపల్లి మల్లారం టి కొత్తగూడెం గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: