మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, వాగొడ్డుగూడెం గ్రామంలో పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులకు పోడుభూమి సాగుదారులకు వివాదం జరిగే సమయంలో సంఘటనను కవర్ చేస్తున్న విలేకరుపై చేయి చేసుకొని కెమెరా లాక్కొని జీబు ఎక్కించే ప్రయత్నం చేసిన విషయం మూడు రోజుల క్రితం జరిగింది అందరికీ తెలిసిందే ఇది ఇలా ఉండగా జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే మెచ్చాను మెచ్చ స్వగృహం తాటి సుబ్బన్న గూడెంలో అశ్వరావుపేట, దమ్మపేట పరిధి అన్ని ప్రెస్ క్లబ్ ల పాత్రికేయులు మర్యాదపూర్వకంగా కలిసి ఫారెస్ట్ అధికారి సంపత్ విలేకరిపై ప్రవర్తించిన తీరును వివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉంటూ ప్రజా సమస్యల్లో పరిష్కారం కోసం కృషి చేస్తున్న విలేకర్ పాత్ర గొప్పదని అలాంటిది ఒక విలేకరిపై ఫారెస్ట్ అధికారి ఈ విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని అన్నారు. సమాజానికి నిజ నిజాలు తెలియజేసే మీడియాపై దాడులు చేయటం సహించరానిదని దీనిపై సెక్షన్ ఆఫీసర్ సంపత్ ను పిలిపించి మీడియా పెద్దల సమక్షంలో చర్చలు జరిపి తగు చర్యలు తీసుకోవాలని డీఎఫ్ఓ కి ఎమ్మెల్యే మెచ్చా ఫోన్లో చెప్పగా సమస్య లేకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన డిఎఫ్ఓ. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట, దమ్మపేట మరియు అందుబాటులో ఉన్న జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు విలేకరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: