మన్యం మనుగడ, కరకగూడెం:మండల పరిధిలోని పద్మపూరం గ్రామ పంచాయితీలో గల మోగిళితోగు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం లో పోషణ పక్షం వారోత్సవాలలో భాగంగా మణుగూరు ఐసిడియస్ సిడిపిఓ జయలక్ష్మి, సూపర్ వైజర్ బద్రమ్మ ల అదేశాలమెరకు అంగన్వాడీ టీచర్ ఎట్టి సూజత అధ్వర్యంలో ఘనంగా నిర్వహించి విద్యార్థులకు అక్షరాస్యతన,గర్భిణీ మహిళలకు శ్రీమంతాలు,బాలింతలకు పౌష్టికాహారం అందజేశారు.ఈ సందర్బంగా సుజాత మాట్లాడుతూ గర్బిణి స్త్రీలకు,పిల్లలకు,బాలింతలకు సరైన పోషకాలు అందించడమె అంగన్వాడీ లక్ష్యం అన్నారు. అలాగే గర్బిణిలకు,బాలింతలలు తీసుకోవలసిన అహారం, జాగ్రత్తల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టిచర్ లు శిరీష,భానుప్రియ,సునీత, సుజాత పాఠశాల ఉపాధ్యాయురాలు వసంత కుమారి గ్రామస్తుల గర్బిణి మహిళలు,పాల్గొన్నారు.
Navigation
Post A Comment: