CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ విసీ పై చర్యలు తీసుకోవాలి

Share it:

 


గుండాల, సెప్టెంబర్ 13(మన్యం మనుగడ) :  నిజామాబాదులోని తెలంగాణ యూనివర్సిటీ విసి రవీందర్ గుప్తా పై చర్యలు తీసుకోవాలని పి డి ఎస్ యు రాష్ట్ర నాయకులు ఇర్ప రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ కి వెళ్లి డ్యాన్స్ చేస్తూ అమ్మాయిలపై నగదు జల్లుతూ పబ్బులను తలపించే విధంగా వ్యవహరించారని అన్నారు. తక్షణమే రవీందర్ గుప్తాను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిని ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకుల పైనే కేసులు పెడతానని బెదిరిస్తున్నారని అన్నారు. విసి పై చర్యలు తీసుకోకపోతే ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్, రణదీప్, శ్యామ్, ప్రసాద్, సుస్మిత, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: