CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలి : ఎంపీపీ మంజు భార్గవి

Share it:


గుండాల/ఆళ్లపల్లి సెప్టెంబర్ 3(మన్యం మనుగడ) : ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆళ్లపల్లి ఎంపీపీ మంజు భార్గవి అన్నారు. శనివారం మండలం పరిధిలోని సంధి బంధం, జాకారం, లొద్ది గూడెం, బోడయికుంట ప్రభుత్వ పాఠశాలలను ఆమె సందర్శించారు. అనంతరం పిల్లలతో ముచ్చటించారు. విద్యార్థులకు గణితం, తెలుగు కనీస అవగాహన లేదని ఆమె అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన నేపథ్యంలో పిల్లలకు తెలుగు నేర్పడంలో ఉపాధ్యాయులు విఫలమవుతున్నారన్నారు. పాఠశాలలకు వచ్చామా వెళ్ళామా అనేది కాకుండా పిల్లలపై శ్రద్ధ పెట్టి విద్యను బోధించాలని ఆమె అన్నారు. ఇకనుండి ప్రతివారం పాఠశాలల సందర్శన ఉంటుందని నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారని ఆమె పేర్కొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: