మన్యం మనుగడ, కరకగూడెం: అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ రేగా.కాళికా అన్నారు. మండల పరిధిలోని కరకగూడెం గ్రామపంచాయతీలో నూతనంగా మంజూరైన పింఛనుదారులకు ఎంపీపీ రేగా కాళిక స్థానిక సర్పంచ్ ఊకె.రామనాథం ఎంపీటీసీ ఎలిపెద్ది. శైలజ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల జీవితాలలో వెలుగు నింపడం కోసం ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలో బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతుందని ఆమె అన్నారు వృద్ధులు దివ్యాంగులు వితంతువుల కుటుంబాలలో వెలుగు నింపడం కోసం వారికి ఆసరా పథకంతో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రావుల.రవి గ్రామ పంచాయతీ సిబ్బంది ఇల్లందుల పిచ్చయ్య పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: