CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటాం : గుండాల సీఐ కరుణాకర్, ఎస్సై రాజశేఖర్

Share it:


గుండాల సెప్టెంబర్ 3(మన్యం మనుగడ) ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తామని గుండాల సీఐ కరుణాకర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్ అన్నారు. శనివారం మండలం పరిధిలోని శంభుని గూడెం గ్రామంలో గ్రామస్తులతో మమేకమై అనంతరం వారు మాట్లాడుతూ. పోలీస్ శాఖ ఎప్పుడు ప్రజల రక్షణ కోసం పాటుపడి పనిచేస్తుందన్నారు. దానితోపాటు ప్రజల సమస్యల సాధన కోసం తమ వంతు బాధ్యతగా భావించి ముందుంటామన్నారు. గిరిజన గ్రామాల్లో యువతలో ఎంతో నైపుణ్యత దాగి ఉందని దానిని గుర్తించి వారికి సరైన సూచనలు చేస్తే వారు ఎంతో అద్భుతాలను సృష్టిస్తారని వారు అన్నారు. కొందరు ప్రశాంతత పల్లెలలో అలజడి సృష్టించటం కోసం ప్రయత్నిస్తారని అలాంటి వారిని తమ గ్రామాల వైపు రాకుండా నిలువరించాలన్నారు. గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మమ్మలను సంప్రదిస్తే సంబంధిత అధికారులకు చేరవేసి పనులు జరిగే విధంగా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: