మన్యం మనుగడ, అశ్వారావుపేట: గణేశుడు అంటే చిన్న పిల్లల్లో ఎనలేని క్రేజ్, వినాయక చవితి వచ్చిందంటే చిన్న చిన్న గల్లీల సైతం గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకొని పూజలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే అశ్వరావుపేట పట్టణంలో చిన్నారులు గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మూడు రోజుల పాటు పూజలు నిర్వహించి శనివారం రిక్షాలో గణేశుని తీసుకొని ఊరేగింపుగా తీసుకొని నిమజ్జనం చేసేందుకు వెళ్లారు. వీరి స్వామి భక్తికి ప్రతి ఒక్కరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అటుగా వెళుతున్న మీడియా ప్రతినిధులను పిలిచి అన్న మా ఊరేగింపుని మా వినాయకుని కవర్ చేయండి ప్లీజ్ అంటూ వారి ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్నారు.
Post A Comment: