మన్యం మనుగడ, కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం లోని మన్యం మనుగుడ విలేఖరి బట్టా.బిక్షపతి నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొని అనంతరం గొల్లగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు, గొల్లగూడెం గ్రామానికి చెందిన పాయం గౌరమ్మ (65) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజులు మరణించడంతో వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించారు, ఇర్ప రామయ్య (55) సంవత్సరాలు అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శ, కుంజా రంగయ్య, అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకొని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు, మడకం రమణ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో వారి ఇంటికివెళ్లి పరామర్శించారు,ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు , మృతుల కుటుంబాలను మరియు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి,అధైర్యపడవద్దు అండగా ఉంటానని వారి భరోసా కల్పించారు.
Navigation
Post A Comment: