మన్యం టివి, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం గ్రామ పంచాయతీ పరిధిలోని రేగులగండి గ్రామం అంగన్వాడీ సెంటర్ లో ముగ్గురు గర్భిణీ స్త్రీలకు పోషక వారోత్సవాల సందర్భంగా సీమంతాలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా హాజరైన ఐసీడీస్ సెక్టర్ సూపర్ వైజర్ సరోజిని మాట్లాడుతూ,అధిక పోషక విలువలు కలిగిన పాలు,గుడ్లు, పండ్లు,ఆకు కూరలు,చేపలు, మాంసం తినడం వలన పుట్టబోయే బిడ్డలు మంచి ఆరోగ్యంతో ఉంటారని అన్నారు.తల్లులు ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేయించుకుని,తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. మనం నివసించే ప్రాంతాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రేగులగండి స్కూల్ టీచర్లు గణేష్,రాంబాబు,అంగన్వాడీ టీచర్లు లీలావతి,వీర కుమారి, రాజేశ్వరి,జయలక్ష్మి, ఏ ఎన్ ఎం వెంకటలక్ష్మి,ఆశా వర్కర్ శారద తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: