CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ రూ.84,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపణీ

Share it:


మన్యం టీవీ , మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలోని మేదర బస్తి,పద్మ గూడెం గ్రామాలలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ.84,000 రూపాయల విలువ గల సిఎంఅర్ ఎఫ్ చెక్కులను పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు అధ్వర్యంలో మణుగూరు తెలంగాణ భవన్ లో బుధవారం నాడు లబ్ధిదారులకు స్థానిక జడ్పిటిసి పోశం.నరసింహారావు,ఎంపీపీ కారం విజయ కుమారి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ,ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో సీఎం సహాయక నిధి ద్వారా అందుకుంటున్న ఈ చెక్కులను మీ ఆర్థిక అవసరాలకు ఆసరాగా ఉంటుందని ఆయన అన్నారు.అనారోగ్యం పాలై, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కుటుంబాలకి ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద మనసుతో తన సహాయ నిధి నుండి నిధులను మంజూరు చేస్తూ,ఎంతో అండగా నిలుస్తున్నారని ఆయన అన్నారు.దేశం లో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు.అన్ని వర్గాల ప్రజలకు అండగా టీఆరెఎస్ ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు.ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.చెక్కులు మంజూరులో ప్రధాన భూమిక పోషించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంపీపీ కారం విజయ్ కుమారి,పిఏసీఎస్ అధ్యక్షులు కుర్రి.నాగేశ్వరరావు, మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాష,పార్టీ మండల పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు,అడపా.అప్పారావు,ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి నవీన్,రామిడి రామిరెడ్డి, మీడియా ఇంఛార్జి తాళ్లపల్లి యాదగిరి గౌడ్,ఎడ్ల శ్రీనివాస్, తాత రమణ, యువజన నాయకులు బో శెట్టి రవి, ముద్ధంగుల కృష్ణ,కట్ట రాజ్ కుమార్,గంగారపు రమేష్,బర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: