*కొత్త వ్యక్తులు వస్తె ఆశ్రమం ఇవ్వదు వెంటనే సమాచారం అందించండి డిఎస్పీ రాఘవెందర్ రావు
*సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి సిఐ రాజగోపాల్
మన్యం మనుగడ కరకగూడెం: కొత్తగూడెం జిల్లా పరిధిలోని వలస ఆదివాసి గ్రామమైన నీలాద్రిపేట గ్రామంలో పోలీస్ శాఖ,ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి 66 మందిని పరీక్షించగా అందులో ఐదుగురికి జ్వరం ఉన్న వారిని గుర్తించి జ్వర పీడితులకు రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించే మందులు పంపిణీ చేశారు.అనంతరం కోవిడ్ వ్యాక్సిన్ నెషన్ లో భాగంగా 55 మందికి బూస్టరు డోస్ టీకాలు అందించడం జరిగింది.ఈ సందర్భంగా మణుగూరు సబ్ డివిజన్ డిఎస్పి రాఘవేందర్ రావు మాట్లాడుతూ ప్రజల సంపూర్ణ ఆరోగ్య లక్ష్యంగా పోలీస్ శాఖ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ముందుగా మీ ఇంటి పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని చూపించారు. అలాగే ఎవరైనా కొత్త వ్యక్తులు మీ గ్రామాలలో కనపడితే వెంటనే పోలీసు వారికి సమాచార అందించాలని తెలిపారు.కొత్త వ్యక్తులకు ఆశ్రమం ఇవ్వకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడుళ్ళ బయ్యారం సిఐ రాజగోపాల్,కరకగూడెం ఎస్ఐ జివన్ రాజు,ఎడుళ్ల బయ్యారం ఎస్ఐ టివి సూరి డాక్టర్ పర్షియా నాయక్ వైద్య సిబ్బంది,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: