గుండాల/ ఆళ్లపల్లి సెప్టెంబర్ 27(మన్యం మనుగడ) మహబూబాద్ జిల్లా బయ్యారం స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం సరైనది కాదని టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ బాబా అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను పార్టీ కార్యకర్తలతో కలిసి దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద ఉన్న కక్షపూరిత వైఖరితోనే సాధ్యం కాదని ప్రకటన చేసిందన్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందన్నారు. కేంద్ర మొండి వైఖరిని విరమించుకొని స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఆదాం, వార్డ్ మెంబర్ చంటి, వెంకన్న, కండె వెంకన్న , సయ్యద్ ఖలీద్, మద్దెల వెంకటేశ్వర్లు, బాబురావు, అబ్బు శ్రీను తదితరులు పాల్గొన్నారు
Post A Comment: