జూలూరుపాడు, సెప్టెంబర్ 29, (మన్యం మనుగడ ప్రతినిధి) : తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక "బతుకమ్మ పండుగ" మరియు తెలుగువారి సాంప్రదాయ తొలి పండుగ "దసరా" సందర్భంగా మండలంలోని పల్లెలన్నీ పండుగ వేడుకలలో ఆనంద ఉత్సాహాలతో, ఆట పాటలతో భక్తి పార్వస్యంలో మునిగి తేలుతున్నాయి. ఒకవైపు బతుకమ్మలాడే మహిళలు, చిన్నారుల డీజే పాటలతో పల్లెలు మారుమ్రోగుతుంటే, మరోవైపు దసరా "దేవి నవరాత్రుల" వేడుకలతో పల్లెలు దేవతలకు కోవెలలుగా మారాయి. బ్రాహ్మణుల వేద మంత్ర ఉచ్చరణతో తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యాలుగా మారాయి. సింగిడిలో రంగులు మాదిరిగా ప్రతి పల్లె మెరిసి మురిసిపోతుంది. సంఘం నాగరాజు, మన్యం టీవీ ప్రతినిధి, జూలూరుపాడు.
Post A Comment: