జూలూరుపాడు, సెప్టెంబర్ 26, (మన్యం మనుగడ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఆర్టీసీ ని కాపాడాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై కొత్తగూడెం జిల్లా డిపో మేనేజర్ చెరుకుమల్ల వెంకటేశ్వరరావు ప్రయాణికులకు ఆర్టీసీ యొక్క ఉపయోగాలు గురించి గురువారం వివరించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఎండి సజ్జనర్ పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో ప్రయాణికు ఆర్టీసీ పై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణం చేసే వారికి ఆర్టీసీ వలన ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయో వివరించారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆర్టిసి సంస్థను గౌరవించి ఆర్టీసీ యొక్క లాభ పేక్షలో పాలుపంచుకోవాలని కోరారు. మీ ఇండ్లలో శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాలి అనుకుంటే బస్ డిపో మేనేజర్ ను సంప్రదిస్తే మీకు అతి తక్కువ ఖర్చుతో ఆర్టీసీ బస్సు కేటాయించబడుతుందని ఆయన తెలిపారు. దీనిని జూలూరుపాడు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్టీసీ సంస్థను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండెపిన్ని వెంకటేశ్వర్లు, ఎల్లంకి మధు, ఎస్.కె చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: