- మాట తప్పని,మడమ తిప్పని నాయకులు సీఎం కేసీఆర్
- సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం:ఎస్టీ సెల్ అధ్యక్షులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని.బాబూరావు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని.బాబూరావు అధ్యక్షతన సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో ఏండ్ల నుంచి గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకొంటున్న పొడు భూముల సమస్య పరిష్కరించడం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గిరిజన పోడు రైతులు.అలాగే గిరిజన బంధు పథకం ప్రకటించిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు చందా హరికృష్ణ, కుంజా రంగయ్య,ఎం.సతీష్,కె విజయ్,ఏనిక లక్ష్మయ్య, చిట్టెయ్య,ఏనికా,సారయ్య,ముసలయ్య,మహిళా నాయకులు దారవత్,రమ,కె.సుమలత,సులోచన,చిట్టెమ్మ,చిన్నక్క,నారాయణమ్మ,ఉద్యమ నాయకులు ఎం డి ముసా తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: