మన్యం టీవీ , మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలోని ఆదర్శనగర్,లెనిన్ నగర్, సుందరయ్య నగర్,శివ లింగాపురం లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ.1,61,000 రూపాయల విలువ గల చెక్కులను పట్టణ అద్యక్షులు అడపా.అప్పారావు అధ్వర్యం లో స్థానిక జడ్పిటిసి పోశం. నరసింహారావు చేతుల మీదుగా ఆదివారం నాడు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యం పాలై,ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కుటుంబాలకి ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద మనసుతో తన సహాయ నిధి నుండి నిధులను మంజూరు చేస్తూ,ఎంతో అండగా నిలుస్తున్నారని ఆయన అన్నారు.దేశం లో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు.అన్ని వర్గాల ప్రజలకు అండగా టీఆరెఎస్ ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు.ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమం లో పిఏసిఎస్ అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,కార్యదర్శులు బొలిశెట్టి నవీన్,టిఆర్ఎస్ నాయకులు వేముల.లక్ష్మయ్య, తాత రమణ,ఆవుల. నరసింహారావు,రామకోటి,గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: