మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారాంపురం జగ్గారం అశ్వాపురం గ్రామాలలో ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా తెరాస ప్రభుత్వం చీరలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పిటిసి సుదిరెడ్డి సులక్షణ రెడ్డి, ఎంపీపీ ముత్తినేని సుజాత గ్రామంలోని మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆడపడుచులకు బతుకమ్మచీరలు, వితంతువులు వికలాంగులకు ఆసరా పింఛన్లు అందిస్తోందని అన్నారు. పేదింటి ఆడపిల్లల కోసం కల్యాణ లక్ష్మి పథకం కింద లక్షా116 రూపాయల ఆర్థికసాయం అందించిన ఘనత సీఎం కేసీఆర్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్ మండల పరిషత్ కోఆప్షన్ ఫోరం జిల్లా అధ్యక్షులు ఎస్కే ఖదీర్ గొల్లగూడెం ఎంపిటిసి ఏనీక రవిబాబు సర్పంచులు చాప ఉమాదేవి సున్నం రాంబాబు బానోత్ శారద ఉప సర్పంచ్లు కందుల వెంకటేశ్వర్లు ఆవుల వెంకటేశ్వర్లు స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: