మన్యం మనుగడ, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం, అంకంపాలెం గ్రామానికి చెందిన గిరిజనులు, అశ్వారావుపేట మండలం బండారుగుంపు సమీపంలో ఎప్పటి నుండో పోడు సాగు చేసుకొంటున్నామని పోడు వ్యవసాయం చేస్తున్న తమ వద్దకు ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది మాట్లాడడానికి అని చెప్పి వచ్చి, తమను అడ్డుకొని, తమపై దాడులకు ప్రయత్నించారనీ తమ ఆదివాసీ మహిళా పై చేయీ చేసుకున్నారని, ఆమె సృహ తప్పి పడిపోయిందని, రేంజ్ అధికారులు, బీట్ అధికారులు, స్థానిక ఎస్ఐ ఉన్నప్పటికీ స్పందించకుండా, నాగళ్ళ ను, ఎద్దులను వేరు చేసారని, దుక్కి దున్నుతున్న నాగళ్ళ ను కూడా వాళ్ళు ఎత్తుకొని జీపులో తీసుకువెళ్లారని, ఇలాంటి చర్యల కు పాల్పడుతున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని గిరిజన పోడు వ్యవసాయదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
Navigation
Post A Comment: