గుండాల, సెప్టెంబర్ 24(మన్యం మనుగడ): మండలంలోని ప్రజలు దసరా వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని తాసిల్దార్ నాగదివ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిసిసిలో బతుకమ్మ చీరలను మహిళలకు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ కానుకను అందజేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ కానుకను అందజేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రామక్క, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీటీసీ సంధాని, సర్పంచ్ సీతారాములు, ఉప సర్పంచ్ ఉపేందర్, సేల్స్ మెన్ పగడయ్య, అధికారులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: