మన్యం మనుగడ, అశ్వారావుపేట: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, బచ్చువారి గూడెం గ్రామపంచాయతీలో సర్పంచ్ కుంజా భవాని ఆధ్వర్యంలో జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి వరలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీర అందిస్తూ మంచి కార్యక్రమం చేపట్టిందని, ఇలా కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రజలకు అందిస్తూ ప్రజలు అభిమానం పొందుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు రామినేని రాంప్రసాద్, వనపర్తి మహేశ్వరావు, కూంజా రాముడు, అసి రాజేష్, మడకం రాజు, మడకం హష్, కిచ్చ రాంబాబు, మడకం కృష్ణ, రామినేని నాగేద్రరావు, మడకం లక్ష్మీణరావు, మడకం శ్రీను, నూపా మహ మహలక్ష్మీ, సెక్రటరీ రాంబాబు, డీలర్ వీరభద్రం మరియు గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: