మన్యం టివి మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, మణుగూరు బిటిపీఎస్ బొగ్గు రవాణా కోసం నిర్మిస్తున్న రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయినటువంటి రైతులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, రేగా కాంతారావు మాట్లాడుతూ,రైల్వే భూ నిర్వాసిత రైతులని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వంతోని మాట్లాడి మెరుగైన ప్యాకేజీ అందించేందుకు కృషి చేస్తాను రైతులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నరసింహారావు,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, నాయకులు వట్టం రాంబాబు, ఉప సర్పంచ్ ప్రభు దాస్,మేకల రవి,యువజన అద్యక్షులు హర్ష నాయుడు,టీఆరెఎస్ ముఖ్య నాయకులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: