మన్యం మనుగడ ప్రతినిధి, చండ్రుగొండ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ( ఎన్ ఎఫ్ ఆర్ బిఈ ) ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు ఒక్క రోజు సమ్మెలో పాల్గొన్నారు. శుక్రవారం స్థానిక ఏపీజీవీబీ బ్యాంకు ఉద్యోగులు పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొనడంతో బ్యాంకు కార్యకలాపాలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా సంఘం బాధ్యులు మాట్లాడుతూ... ప్రైవేటీకరణ వల్ల బ్యాంకులు భవిష్యత్తు విశ్వసనీయతను ఖాతాదారులు కోల్పోవడం జరుగుతుందన్నారు.ప్రైవేటీకరణ ఆలోచనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: