CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యార్థుల సామర్ధ్యాలను పెంచాలి.. జిల్లా విద్యాశాఖాధికారి సోమేశ్వర శర్మ..

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి, చండ్రుగొండ : విద్యార్థులలో దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీయాలని , ప్రతి విద్యార్థి కనీసం ఐదో తరగతి లోపు చదవడం, రాయడం రావాలని జిల్లా విద్యాశాఖాధికారి సోమేశ్వర శర్మ   ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం సీతాయిగూడెం యుపిఎస్ పాఠశాలను ఆయన ఆకస్మితంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల బోధనను స్వయంగా విద్యార్థులతో కలిసి తరగతి గదిలో కూర్చుని పరిశీలించి, ఉపాధ్యాయులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. విద్యార్థుల స్థాయి, సామర్థ్యాలను పరీక్షించి, అసంతృప్తిని వ్యక్తం చేశారు.కనీసం విద్యార్థులకు చదవడం రాకపోతే ఎలా అని ఉపాధ్యాయులను హెచ్చరించారు. బోధనలో మార్పులు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట స్థానిక హెచ్ఎం ఆనంద్, ఉపాధ్యాయులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: