మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూల్ల బయ్యారం పోలీసు ఆధ్వర్యంలో ఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం ఓ ఎస్ డి సూచనలు మేరకు ఆశ్రమ పాఠశాలలోని 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎల్ఈడీ లైట్లును మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కావద్దని, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండి తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజ గోపాల్ , ఎస్సై టీవీఆర్ సూరి , పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: