CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

Share it:


మన్యం టివి భూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లోని పలు గ్రామాలకు చెందిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.4,32,500 రూపాయాల సీఎం రిలీఫ్ చెక్కులను బూర్గంపాడు మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత చేతుల మీదుగా ఆదివారం నాడు పలువురు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా  బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ,నిరుపేదల ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగం చేసుకోవాలని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు,దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఎంతోమంది పేద ప్రజలకు వైద్య ఖర్చులు నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందుతుందని,వైద్యం చేయించుకొని ఆర్థిక స్తోమత లేని ప్రజలందరూ సీఎం రిలీఫ్ ఫండ్ సేవలను వినియోగించుకోవాలని వారన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, అదేవిధంగా స్థానిక ప్రజా ప్రతినిధులకు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పేదల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గాని కృషి చేస్తుందని అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ఎడమ కంటి ఝాన్సీ,సొసైటీ డైరెక్టర్ భూక్య శ్రీను,స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: