- ఇచ్చిన మాటకు నిలబడే మహానేత కెసిఆర్
- దళిత బంధు నియోజకవర్గంలో 500 దళిత బంధు లబ్ధిదారుల పెంచడం హర్షనీయం
- మండల అధ్యక్షులు పాయం నరసింహారావు
గుండాల/ఆళ్లపల్లి, సెప్టెంబర్ 4(మన్యం మనుగడ) :: ఇచ్చిన మాటకు నిలబడే మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, జడ్పిటిసి హనుమంతరావు అన్నారు. ఆదివారం మండలం పరిధిలోని మర్కోడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పినపాక ఎమ్మెల్యే రేగా చిత్రపటానికి కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శనివారం క్యాబినెట్ సమావేశంలో ప్రతి నియోజకవర్గంలో 500 మందికి దళిత బందును ఇస్తామని పోడు భూములకు పట్టాలిస్తామని సమావేశంలో నిర్ణయించడం అర్షనీయమన్నారు. మాట ఇస్తే మాట మీద నిలబడే మహా నాయకుడు కేసీఆర్ అని కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రగతి సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, సర్పంచ్ శంకర్ బాబు, చైర్మన్ రామయ్య, యువజన విభాగం అధ్యక్షులు సతీష్ , ఎస్సీ సెల్ నాయకులు వేమూరి రాంబాబు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: