మన్యం టీవీ , దుమ్ముగూడెం ::
మండలంలోని ప్రగల్లపల్లి పంచాయతీ శ్రీనగర్ కాలనీ గ్రామంలో అంగన్వాడి ప్రహరీ గోడ నిర్మాణానికి ఎంపీపీ జడ్పిటిసి స్థానిక సర్పంచ్ తో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు స్థానిక ఎంపీటీసీ మడకం రామారావు మండల ప్రజా పరిషత్ నిధుల లక్ష యాభై ఆరువేల రూపాయలతో నిర్మాణ పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్య వైద్యం గురించి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయడం శుభపరిణామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జుంజురు లక్ష్మి ఎంపీపీ రేసు లక్ష్మి జడ్పిటిసి సీతమ్మ ఎంపీటీసీ మడకం రామారావు టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి రాముడు పార్టీ ఉపాధ్యక్షులు తునికి కామేశ్వరరావు ఎంపీటీసీలు తిరుపతిరావు తునికి సీత భీమ్ రాజు పార్టీ నాయకులు జయసింహ సాగర్ మునీంద్ర తదితరులు పాల్గొన్నారు
Post A Comment: