మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లి పాక బంజర గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల గోదావరి వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న వరద బాధితులకు రోటరీ ఇంటర్నేషనల్ జిల్లాలోని భద్రాచలం రివర్ సైడ్ క్లబ్ సహాయంతో తెలంగాణ రాష్ట్ర గుంటూరు ప్రకాశం జిల్లాలో రోటరీ ఇంటర్నేషనల్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు అశ్వాపురం మండలంలోని నెల్లిపాక గ్రామంలోని వరద బాధితులకు రోటరీ క్లబ్ కి సంబంధించిన ఒక బ్యాగు రెండు దుప్పట్లు, రెండు కండువాలు ఒక చీర,ఒక పంచె ఉన్న 1200 రూపాయిల విలువ గల కిట్టుని పంపిణీ చేశారు.వరద బాధితులకు ఇంత పెద్ద సహాయ కార్యక్రమం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర గుంటూరు ప్రకాశం జిల్లాలకు కాబోయే రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ డాక్టర్.బూసిరెడ్డి శంకర్ రెడ్డి కి వరద బాధితులంతా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్ కోమటిరెడ్డి.రాజశేఖర్ రెడ్డి,భద్రాచలం రివర్ సైడ్ క్లబ్ ప్రెసిడెంట్ మంగళగిరి హనుమంతరావు,సెక్రటరీ గంజి సంపత్, సామ సందీప్ రెడ్డి,బత్తుల సంపత్,జీనుగు రాము తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: