మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలంలో విజయవంతంగా 44 వ రోజు కూడ కొనసాగుతున్న గ్రామ సేవకుల నిరవధిక సమ్మె. ఈ సందర్బంగా గ్రామ సేవకుల మండల అధ్యక్షులు పాగా బాబు మాట్లాడుతూ 22 మంది గ్రామ సేవకులు చనిపోయిన కూడా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం.గ్రామ సేవకులందరికి పే స్కేల్, అర్హులైన గ్రామ సేవకులకు ప్రమోషన్లు, 55 సంవత్సరాలు పైబడిన గ్రామ సేవకుల వారసులకు ఉద్యోగాలకు సంబందించిన జీ ఓ లు వెలుబడే వరకు సమ్మెను విరమించేది లేదని, అవసరం అయితే సమ్మెను ఉదృతం చేస్తామనిఈ సందర్బంగా తెలియజేయడం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సేవకుల మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున,ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహమూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు ,సందీప్,నర్సింహారావు, గౌసియా బేగం, సమ్మక్క, సమ్మయ్య , రాజేశ్వరి,పగిడమ్మా, రాణి, రాము, ఈశ్వరమ్మ, శ్రీను , మాధవి, ఖాజా హుస్సేన్, కార్తిక్, ముత్తయ్య,ఎల్లమ్మ,ముజాఫర్, వెంకటనర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: