మన్యం టీవీ, చర్ల : మావోయిస్టులు తమ ఉనికి కోల్పోతున్నామనే నిరాశ నిస్పృహల మధ్య హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో చర్ల, దుమ్ముగూడెం అటవీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత కూంబింగ్ చేపడుతున్నారు. భద్రాచలం ఏఎస్పి రోహిత్ రాజ్ నేతృత్వంలో చర్ల సిఐ బి అశోక్ ఆధ్వర్యంలో ఎస్సైలు రాజు వర్మ, వెంకటప్పయ్య లు సి ఆర్ పి ఎఫ్ బలగాలు సంయుక్తంగా అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇటీవల మండల పరిధిలోని కుర్నపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఇర్పా రాముడు ను ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ విస్తృత కూంబింగ్ నిర్వహిస్తున్నారు. భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ సూచనల మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అన్ని బేస్ క్యాంపులను అప్రమత్తం చేసి, ఆ క్యాంపుల పరిరక్షణ కోసం పోలీసులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. పోలీసుల విస్తృత దాడులు, వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్న క్రమంలో మావోయిస్టులు ఈ ప్రాంతం నుండి తరలి పోయారని, ప్రస్తుతం చత్తీస్ గఢ్ లో తలదాచుకుంటున్న మావోయిస్టులు వారి ఉనికిని కోల్పోతున్న క్రమంలో తెలంగాణలో అడపాదడపా ఇలాంటి దుశ్యర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అమాయక ఆదివాసీలను వారి పనులకు వినియోగించుకుంటూ వారిని మట్టు పెట్టేందుకు కూడా మావోయిస్టులు వెనకాడడం లేదని ఏఎస్పి రోహిత్ రాజు తెలిపారు.
Navigation
Post A Comment: