గుండాల సెప్టెంబర్ 30(మన్యం మనుగడ) తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయ పండుగ అయిన పూల పండుగ బతుకమ్మ వేడుకల్లో సాయనపల్లి ఎంపీటీసీ కల్తీ కృష్ణారావు పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలో గల గణాపురం, భీమునిపల్లి గ్రామాల్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ పెద్ద పండుగ అయిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రత్యేక వివిధ గ్రామాల్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శోభన్ బాబు, ఉప సర్పంచ్ జగ్గారావు, కన్నయ్య, సంజీవరావు, బసవయ్య, సాగర్, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: