CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పండుగ సెలవులకు ఇంటిని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు మాకు సమాచారం ఇవ్వండి సబ్ ఇన్ స్పెక్టర్ పోటు గణేష్..

Share it:


జూలూరుపాడు, సెప్టెంబర్ 30, (మన్యం మనుగడ ప్రతినిధి) "దసరా పండుగ" సెలవులు సందర్భంగా ఇంటిని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు మాకు సమాచారం ఇవ్వండి అంటూ జూలూరుపాడు సబ్ ఇన్ స్పెక్టర్ పోటు గణేష్ కోరారు. మనుషులు లేని ఇండ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతున్న కేటుగాళ్ల ఆటలు కట్టించే క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా. వినీత్ .జి ఐపీఎస్ మరియు కొత్తగూడెం డిఎస్పి ఎస్ వెంకటేశ్వర బాబు ఆదేశానుసారం ప్రకటన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చినట్లయితే అట్టి ఇండ్లపై పోలీస్ నిఘా ఉంటుందని తెలిపారు. ఖాళీ ఇండ్లలో విలువైన బంగారు ఆభరణాలు కానీ, డబ్బు కానీ వదిలి వెళ్ళకూడదని కోరారు. ఇంటికి నాణ్యమైన తాళాలను వాడాలని అన్నారు. సమాచారం అందించిన ప్రాంతాలలో పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: