జూలూరుపాడు, సెప్టెంబర్ 30, (మన్యం మనుగడ ప్రతినిధి) దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని కాకర్ల గ్రామంలో కుంకుమ పూజ అర్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతోటి ఘనంగా నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవరోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులు దుర్గాదేవిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని 108 మంది ముత్తయిదుగులచే గ్రామ పురోహితులు పురాణం శ్రీనివాస్ శర్మ కుంకుమ పూజ అర్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Navigation
Post A Comment: