CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ ప్రజా ప్రతినిధులు ఆదివాసి చట్టాలను చుట్టాలగా చూస్తున్నారు.

Share it:



  •  ఆదివాసీ ప్రజా ప్రతినిధులు ఆదివాసి చట్టాలను చుట్టాలగా చూస్తున్నారు.
  • ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను నిర్బంధించిన ఆదివాసీలు
  • ఆదివాసీల పై మాటల దాడికి దిగిన ఆదివాసీ ప్రజాప్రతినిధులు
  • మండల పరిషత్తు కార్యాలయం లో దాక్కున ప్రజా ప్రతినిధులు
  • అట్టుడికిన మండల పరిషత్ కార్యాలయం
  • బర్లగూడెం సర్పంచి కొర్శా నర్సింహమూర్తి.                                      

మన్యం మనుగడ సెప్టెంబర్ 22 వెంకటాపురం:                           

వలస గిరిజనేతరులను ఏజెన్సీ నుండి వెళ్లిపోవాలని, ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలని చేస్తున్న దీక్ష బుధవారం నాటికి 30 వ రోజుకు చేరుకున్నాయి. ఎల్టీఆర్ కేసులు వలస గిరిజనేతరుల పైన ఎందుకు పెట్టడం లేదని వందలాదిమంది ఆదివాసీలు మండల కేంద్రంలో  భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం వందల మంది ఆదివాసీలు మండల పరిషత్తు కార్యాలయాన్ని చుట్టుముట్టారు. అధికారులు పని చేయకుండా అడ్డుకునేది ఆదివాసీ ప్రజా ప్రతినిధులే అన్నారు. ఆదివాసీ ప్రజా ప్రతినిధులు చట్టాలను  ఎందుకు అమలు   చేయడం లేదని ఆదివాసీ మహిళలు నిలదీశారు.  ఆదివాసీ ప్రజా ప్రతినిధులు బయటికి రావాలని వందల మంది  ఆదివాసీలు నినాదాలు చేశారు. బయటికి రావాలని ఆదివాసీలు పట్టుబట్టడంతో ప్రజా ప్రతినిధులు మండల పరిషత్తు కార్యాలయంలో దాక్కోవడం జరిగింది. ప్రజాప్రతినిధులు బయటకి రాకపోవడంతో అక్కడే బైఠాయించారు. వందల మంది ఆదివాసీలు పెద్ద ఎత్తున దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేయడంతో అధికారులు ప్రజాప్రతినిధులు భయాందోళనకు గురయ్యారు. ఆదివాసీల పక్షమా వలస గిరిజనేతరుల పక్షమా ప్రశ్నించారు. ఆదివాసీ చట్టాలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బర్లగూడెం సర్పంచి నర్సింహమూర్తి మాట్లాడుతూ ఆదివాసీ ప్రజాప్రతినిధుల మౌనం భావితరాలకు మరణ  శాశనం అన్నారు. ఎవరి లాభం కోసం ఈ మౌనం అన్నారు. ఏ.ఎన్.ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  వాసం నాగరాజు మాట్లాడుతూ ఆదివాసీ చట్టాలను అమలు చేయని ప్రజా ప్రతినిధులు తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసారు. ఆదివాసీ ప్రజలను చైతన్యం చేస్తామని, ప్రజలను ప్రశ్నించేలా చేయడం నిమగ్నం అవుతానని పేర్కొన్నారు. సుభద్ర,రాధ, విజయ్, కురసం వెంకటేష్, ఇర్ప రవి  మండలంలోని సుమారు 600 మంది ఆదివాసీలు ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: