మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: గర్భిణీలు,బాలింతలకు పౌష్టికాహారం అందించడమే అంగన్వాడి కేంద్రాల లక్ష్యమని ఐసిడిఎస్ సూపర్వైజర్ శకుంతల అన్నారు. బుధవారం వెంకటాయ తండా పంచాయతీలో పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వయస్సు తగ్గ బరువు లేని చిన్నారులను గుర్తించి వారికి ప్రత్యేక ఆహారం అందించడం జరుగుతుందన్నారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీలు పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు,ఆయాలు, గ్రామస్తులు, పాల్గొన్నారు.
Post A Comment: