CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లోడే శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భాజపా పార్టీ సమావేశం

Share it:


మన్యం మనుగడ, మంగపేట:

భాజపా మంగపేట మండల  యువ నాయకుడు లోడే శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ రోజు విస్తృత సమావేశాలు రోజుకు ఒక గ్రామం లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశాలలో బాగంగా శుక్రవారం మంగపేట మండల పరిధిలోని బ్రహ్మణపెళ్లి గ్రామంలో  బీజేపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణయ్య  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి నుండి 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరడం జరిగింది. వారికి తాటి క్రిష్ణయ్య బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం బ్రాహ్మణపల్లి గ్రామం లోని ప్రజల ఇంటివద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. త్రాగునీరు, పాఠశాల, ఊరికి వచ్చి వెళ్లే దారి సరిగా లేదని గుర్తించారు. వాటికి సంబంధిత అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఊరంతా కృష్ణయ్య తోనే ఉంటామని మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అల్లే జనార్దన్, జిల్లా మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి నాగుల్ మీరా, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు,జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు దంతనపెళ్లి నరేందర్,జిల్లా కార్యవర్గ సభ్యులు గందసిరి శ్రీనివాస్,మండల నాయకులు మల్ రెడ్డి సుధాకర్ రెడ్డి, పోలేబొయిన కేశవరావు,లోడిగా మధుకర్, గుండెబోయిన సంతోష్ లు పాల్గొన్నారు. చేరిన వారిలో సున్నం నరసింహారావు, వజ్జ రాంబాబు, బాడిశ శివాజీ, వాగబోయిన నరేష్, మోడెం శివశంకర్, బాడిశ లక్ష్మి, కాక నాగేంద్రబాబు, వజ్జ ప్రశాంత్,బాదిశ శ్రీనివాస్,వజ్జ వెంకటేశ్వర్లు, గొప్ప కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: